ప్రభాస్, మారుతీ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో ఫిక్స్ ?

ప్రభాస్, మారుతీ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో ఫిక్స్ ?

Published on Dec 2, 2022 3:00 AM IST


ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొత్తం నాలుగు సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. వాటిలో ఓం రౌత్ తో చేస్తోన్న ఆదిపురుష్ ఇటీవల షూట్ మొత్తం పూర్తి చేసుకోగా ప్రస్తుతం దాని విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. అలానే కెజిఎఫ్ మూవీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తోన్న సలార్ వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలానే నాగ అశ్విన్ తో చేస్తోన్న ప్రాజక్ట్ కె కూడా పలు షెడ్యూల్స్ తో కొనసాగుతోంది.

అయితే వీటితో పాటు ఇటీవల మారుతీ దర్శకత్వంలో కూడా ఒక మూవీ మొదలెట్టారు ప్రభాస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీని మంచి యాక్షన్ తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా మారుతీ తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు. అలానే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ప్రభాస్ కి జోడీగా నటించనున్నారట. అయితే ఈ మూవీకి సంబందించిన పూర్తి డీటెయిల్స్ అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. మొత్తంగా ప్రభాస్ నుండి వస్తున్న ఈ నాలుగు మూవీస్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు