‘వాల్మీకి’ టైటిల్ పై హైకోర్టులో పిటిషన్‌ !

‘వాల్మీకి’ టైటిల్ పై హైకోర్టులో పిటిషన్‌ !

Published on Aug 26, 2019 6:11 PM IST

వరుణ్‌ తేజ్‌ – హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘వాల్మీకి’. బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారని, ఎట్టిపరిస్థితులో ఈ చిత్రం టైటిల్‌ మార్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని బోయ హక్కుల సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తమ కులస్థులను కించపరిచేలా ఈ సినిమాని తీసిన చిత్రబృందం పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో కూడా గ్యాంగ్‌ స్టర్‌ గా మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ లో కనిపించబోతున్నాడు.

అయితే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. ఇక ఈ సినిమాను సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ తమిళ్‌ యంగ్ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు