బుల్లితెర పై “కెప్టెన్ మిల్లర్” కి షాకింగ్ రెస్పాన్స్!

బుల్లితెర పై “కెప్టెన్ మిల్లర్” కి షాకింగ్ రెస్పాన్స్!

Published on Apr 4, 2024 11:08 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ కెప్టెన్ మిల్లర్ (Captain Miller). ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న థియేటర్ల లోకి వచ్చింది. అయితే ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో ప్రసారం అయ్యింది.

అందుకు సంబందించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా వెలువడింది. ఈ చిత్రం షాకింగ్ టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేసుకుంది. 1.20 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా, అదితి బాలన్, శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు