ట్రైలర్ తో ఆకట్టుకున్న ‘సవ్యసాచి’ !

ట్రైలర్ తో ఆకట్టుకున్న ‘సవ్యసాచి’ !

Published on Oct 24, 2018 5:03 PM IST

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయకిగా రాబోతున్న చిత్రం ‘సవ్యసాచి’. కాగా ఈ చిత్రం ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 3 గంటలకు విడుదల చేసింది చిత్రబృందం. కాగా ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు ట్రైలర్ ఇంకా సినిమా పై అంచనాలను పెంచే విధంగా ఉంది.

ట్రైలర్ లో ప్రధానంగా చైతు మాధవన్ తో పాటు ‘ప్రేమ, కోపం లాంటి ఎమోషన్స్ మీకు వస్తే మీరు మాత్రమే రియాక్ట్ అవుతారు. కానీ అవి నాకొస్తే నాతో పాటు ఇంకొకడు కూడా రియాక్ట్ అవుతాడు’ అంటూ చైతు చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంది. మొత్తానికి ట్రైలర్ అక్కినేని అభిమానులకి నచ్చే విధంగా ఉంది.

వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ నటుడు ఆర్.మాధవన్, మాజీ హీరోయిన్ భూమిక కూడా కీలకపాత్రల్లో నటిస్తుండటం విశేషం. ప్రేమమ్ తరువాత చైతు, చందూ మొండేటిల కలయికలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు