ఓటిటి లోకి వచ్చేసిన “చారి 111”

ఓటిటి లోకి వచ్చేసిన “చారి 111”

Published on Apr 5, 2024 10:00 PM IST

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ చారి 111. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. మురళి శర్మ, సంయుక్త విశ్వనాథన్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సిమోన్ కే. కింగ్ సంగీతం అందించారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. నేడు సడెన్ గా డిజిటల్ ప్రీమియర్ గా ఎంట్రీ ఇచ్చింది. థియేటర్ల లో సినిమాను చూడటం మిస్ అయిన వారికి ఇది మంచి అవకాశం అని చెప్పాలి. అదితి సోనీ నిర్మించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

రివ్యూ కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు