ఏప్రిల్ లో విడుదలకానున్న చిత్రలహరి !

ఏప్రిల్ లో విడుదలకానున్న చిత్రలహరి !

Published on Nov 19, 2018 4:26 PM IST

‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రం తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొన్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తాజాగా తన కొత్త చిత్రం ‘చిత్రలహరి’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ రోజు ఈచిత్రం యొక్క షూటింగ్ ప్రారంభమైంది. కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ , నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హీరోహీరోయిన్ల ఫై కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సునీల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో తేజు కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు