సుశాంత్ మరణంపై వైరల్ అవుతున్న సరోజ్ ఖాన్ చివరి పోస్ట్.

సుశాంత్ మరణంపై వైరల్ అవుతున్న సరోజ్ ఖాన్ చివరి పోస్ట్.

Published on Jul 3, 2020 7:04 PM IST

బాలీవుడ్ లో నేడు భారీ విషాదం చోటు చేసుకుంది. 40 ఏళ్ళుగా కొరియోగ్రాఫర్ గా పనిచేసిన సరోజ్ ఖాన్ నేడు గుండె పోటుతో మరణించారు. బాలీవుడ్ లో ఈ సంఘటన పెను విషాదంగా మారింది. కాగా ఇటీవల సుశాంత్ ఆత్మహత్య చేసుకోగా ఆయన మరణం గురించి సరోజ్ ఖాన్ ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. సరోజ్ ఖాన్ నేడు మరణించిన నేపథ్యంలో ఆమె చివరి పోస్ట్ వైరల్ గా మారింది.

‘నేను మీతో ఎప్పుడూ పని చేయలేదు కానీ చాలాసార్లు కలుసుకున్నాం. నేను మీ అన్ని చిత్రాలను చూశాను. మీరన్నా, మీ చిత్రాలన్నా నాకెంతో ఇష్టం. అయితే మీ జీవితంలో ఏం పొరపాటు జరిగింది? మీరు మీ జీవితానికి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయంతో తీవ్ర షాక్‌కు గుర్యయ్యాను. నీ కష్టాలను, బాధలను పెద్దవాళ్లతో పంచుకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. అప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎంటో నాకు తెలియదు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. సుశాంత్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానభూతి తెలుపుతున్నాను’ అంటూ సుశాంత్‌ మృతి పట్ల సరోజ్‌ ఖాన్‌ తన సంతాపం తెలిపారు.

https://www.instagram.com/p/CBazhptBaWV/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు