మారేడుమిల్లి ప్రజానీకం నుంచి క్రేజీ అప్ డేట్ !

మారేడుమిల్లి ప్రజానీకం నుంచి క్రేజీ అప్ డేట్ !

Published on Oct 23, 2022 6:11 PM IST

అల్లరి నరేష్ హీరోగా రాబోతున్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. కాగా తాజాగా ఈ చిత్రం పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ వెరీ ఎమోషనల్ గా సాగుతుందని, నరేష్ పెర్ఫార్మన్స్ అధ్భుతంగా ఉంటుందని, తన కెరీర్ లోనే నరేష్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. మరీ ఈ సీరియస్ డ్రామాలో నరేష్ సీరియస్ యాక్టింగ్ ఏ రేంజ్ లో పేలుతుందో చూడాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఎక్కడో మారుమూల అడవుల్లో నివసించే గిరిజన జాతి జీవితాలు ఆధారంగా ఈ చిత్రం సాగనుంది. గిరిజన జాతిలో పుట్టి పెరిగిన వారి జీవితాల్లో నరేష్ పాత్ర ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనేది సినిమా మెయిన్ పాయింట్ అట. కథలో భాగంగా నరేష్ పాత్ర ఎదుర్కొనే విపత్కర పరిస్థితులు చాలా బాగా వచ్చాయని.. ఎమోషల్ గా అవి బాగా ఆకట్టుకుంటాయి అని తెలుస్తోంది.

కాగా ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. మరి ఈ మారేడుమిల్లి నియోజకవర్గం ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు