డిసెంబర్ 29న థియేటర్ల లోకి “కరెన్సీ నగర్”

డిసెంబర్ 29న థియేటర్ల లోకి “కరెన్సీ నగర్”

Published on Dec 14, 2023 8:00 AM IST

ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు, డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్న చిత్రం కరెన్సీ నగర్. యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 29న థియేటర్ల లోకి విడుదల కాబోతోంది.

డబ్బు చుట్టూ తిరిగే కథగా కరెన్సీ నగర్ సినిమా ఉండనుంది. డబ్బుకు, మనిషికి ఉన్న సంబంధాన్ని దర్శకుడు వెన్నెల కుమార్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ పాయింట్ అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు