SSMB28 : నిజంగానే అంతా మారిపోయిందా ?

SSMB28 : నిజంగానే అంతా మారిపోయిందా ?

Published on Nov 30, 2022 1:13 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు తో ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న SSMB28 మూవీ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ఈ మూవీలో పక్కా మాస్ రోల్ చేస్తుండగా పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుంది.

అయితే విషయం ఏమిటంటే, ఇటీవల ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలావరకు చేంజెస్ చేసారని, అలానే ముందుగా అనుకున్న విధంగా హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కాకుండా పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దీనిని రూపొందించేలా సూపర్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసారని లేటెస్ట్ బజ్. అలానే ఈ మూవీలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ సీనియర్ హీరోయిన్ శోభన ఇందులో కీలక రోల్ చేయనున్నారు అనే వార్త కూడా ప్రచారంలో ఉంది. మరి నిజంగానే మహేష్, త్రివిక్రమ్ ల ఈ క్రేజీ మూవీ యొక్క స్క్రిప్ట్ లో చేంజెస్ జరిగాయా, అలానే శ్రీలీల, శోభన నటిస్తున్నారా లేదా అనేటువంటి బజ్ పై పూర్తిగా క్లారిటీ రావాలి అంటే SSMB28 మూవీ యూనిట్ నుండి దీని పై క్లారిటీ రావాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు