‘మహర్షి’ సక్సెస్ పై అశ్వినీ దత్, దిల్ రాజు స్పందన !

‘మహర్షి’ సక్సెస్ పై అశ్వినీ దత్, దిల్ రాజు స్పందన !

Published on May 12, 2019 3:28 PM IST


హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు వచ్చిన ‘మహర్షి’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం నైజాం లాంటి కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసింది. కాగా చిత్రబృందం ఈ రోజు సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది.

ఈ సందర్భంగా అశ్వినీ దత్ మాట్లాడుతూ.. ‘కృష్ణ గారి సూపర్ హిట్స్ అన్ని రైతు బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన సినిమాలే. ఈ రికార్డ్ కలెక్షన్స్ కి కారణం మహేష్, వంశీ. మే 9న విడుదలైన నా మూడు సినిమాలు తెలుగు ఇండస్ట్రీ కి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చినందుకు గర్వంగా ఉంది అని తెలిపారు.

అలాగే మరో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ… ‘నా నమ్మకం నిజమై మహేష్ బాబు గారి 25వ ఫిల్మ్ ఎపిక్ బ్లాక్ బస్టర్ అవడం చాలా గర్వంగా ఉంది. యూనిట్ అందరూ పడిన కష్టమే మహర్షిని ఈ రోజు క్లాసిక్ గా నిలబెట్టింది. ఫస్ట్ వీక్ లోనే మహేష్ గారి కెరీర్ లో అన్ని రికార్డలను క్రాస్ చేయబోతోంది ఈ సినిమా అని దిల్ రాజు చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు