ఈ సినిమాలో గొప్ప గ్లోబల్ మెసేజ్ ఉంది – దర్శకుడు శంకర్

ఈ సినిమాలో గొప్ప గ్లోబల్ మెసేజ్ ఉంది – దర్శకుడు శంకర్

Published on Nov 26, 2018 8:32 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న ‘2.ఓ’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని పార్క్ హైయేత్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తోన్న టైంలో రజినీకాంత్ గారికి హెల్త్ ప్రొబ్లెమ్స్ వచ్చాయి,. ఆయన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ షూటింగ్ ఆగిపోతే నిర్మాతకి భారీ నష్టం అని ఆయన అలాంటి సిచ్యుయేషన్ లో కూడా వచ్చి షూట్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ ని పూర్తి చేశారు. ఆయన అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకమని.. రజినీ పై శంకర్ ప్రశంసల వర్షం కురిపించారు.

శంకర్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ సినిమాని 4డీ సౌండ్స్‌ తో త్రీడిలో తెరకెక్కించాం, దయచేసి అందరూ ఈ సినిమాని త్రీడిలోనే చూడండి. మీకు గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. అలాగే ఈ సినిమాలో గొప్ప గ్లోబల్ మెసేజ్ కూడా ఉంది. ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఖచ్చితంగా ఈ చిత్రం ఆకట్టుకుంటుందని శంకర్ తెలిపారు.

కాగా అమీ జాక్సన్ కథానాయకిగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఏఅర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసాద్ మరియు దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ వంశీ సంయుక్తంగా నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత విలువ ఇస్తూ, అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో.. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు