మూడు సినిమాలు లైన్ లో పెట్టిన అల్లరి నరేష్ డైరెక్టర్.

మూడు సినిమాలు లైన్ లో పెట్టిన అల్లరి నరేష్ డైరెక్టర్.

Published on Jul 5, 2020 9:10 PM IST

అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ నాంది. ఆయన పుట్టినరోజు సంధర్భంగా నాంది చిత్ర టీజర్ విడుదల చేశారు. సీరియస్ కంటెంట్ తో సాగిన నాంది టీజర్ కి ప్రశంశలు దక్కాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాడని అర్థం అవుతుంది. కాగా ఈ చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల వరుస ఆఫర్స్ అందుకున్నాడని సమాచారం. ఆయన మొదటి చిత్రం నాంది విడుదల కాక ముందే ఆయన మూడు చిత్రాలకు సైన్ చేశారు.

విజయ్ కనకమేడలతో ఎస్ ఆర్ టి ఎంటరైన్మెంట్స్, ఏ కె ఎంటరైన్మెంట్స్ మరియు ఈస్ట్ కోస్ట్ పిక్చర్స్ చిత్రాలు చేయడానికి ముందుకు వచ్చాయని సమాచారం. ఈ మూడు బ్యానర్స్ లో ఒక్కో చిత్రం ఆయన చేయనున్నాడు. ఇక ఈ చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది. నాంది మూవీ న్యాయవ్యవస్థలోని లోపాలను ప్రశ్నించేదిగా ఉంటుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు