రూ.100 కోట్ల మార్కును అందుకున్న ‘డీజే’ !

రూ.100 కోట్ల మార్కును అందుకున్న ‘డీజే’ !

Published on Jun 30, 2017 5:02 PM IST


అల్లు అర్జున్ తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’ తెలుగు రాష్ట్రాలైన ఏపి, తెలంగాణాల్లో దిగ్విజయంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. సెలవు రోజుల్లో మాత్రమే గాక వీక్ డేస్ లో కూడా సినిమా వసూళ్లు బాగానే నడుస్తున్నాయి. బన్నీ గత సినిమా భారీ హిట్ కావడం, ట్రైలర్లు, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగి భారీ స్థాయి ఓపెనింగ్స్ దక్కాయి. మొదటి 5 రోజుల్లో ఏపి, తెలంగాణా జిల్లాలో రూ. 47. 21 కోట్లు కలెక్ష్ చేసిన ఈ సినిమా వారం గడిచేసరికి రూ. 50. 60 కోట్లు ఖాతాలో వేసుకుంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా వసూలైన గ్రాస్ చూస్తే రూ. 102 కొట్లగాను షేర్ రూ.62.20 కోట్లగాను లెక్క తేలింది. ప్రాంతాల వారీగా షేర్ ఈ లెక్కల్ని చూస్తే…

ఏరియా వసూళ్లు
నైజాం 17.72 కోట్లు
సీడెడ్ 8.84 కోట్లు
ఉత్తరాంధ్ర 6.18 కోట్లు
గుంటూరు 4.70 కోట్లు
కృష్ణ 3.44 కోట్లు
ఈస్ట్ గోదావారి 4.07 కోట్లు
వెస్ట్ గోదావారి 3.49 కోట్లు
నెల్లూరు 2.15 కోట్లు
కర్ణాటక
6.10 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా
1 కోటి
యూఎస్
3.30 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్
1.20 కోట్లు
మొత్తం
62.20 కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు