డబ్బింగ్ దశలో మహేష్ బాబు ‘ఆగడు’

డబ్బింగ్ దశలో మహేష్ బాబు ‘ఆగడు’

Published on May 19, 2014 3:26 PM IST

mahesh_babu
మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆగడు’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు సోమవారం ఉదయం మొదలయ్యాయి. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలలో హీరో మహేష్ బాబు, చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల మరియు నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సినిమాలోని ప్రధాన సన్నివేశాలను చిత్రికరించడానికి ఈ చిత్ర యూనిట్ మే 20న లడక్ వెళ్లనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తుండగా, సోనూ సూద్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు