ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘ఎవరు’ !

ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘ఎవరు’ !

Published on Aug 5, 2019 10:48 AM IST


వెంక‌ట్ రామ్‌జీ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా రెజీనా క‌సండ్ర హీరోయిన్‌ గా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ మూవీ ‘ఎవరు’. కాగా తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల అయింది. ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతూ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సస్పెన్స్ రేకెత్తించే అంశాలతో పాటు సీరియస్ గా సాగే మర్డర్ కేసు గురించి చేసే విచారణ కూడా సినిమా పై ఆసక్తిని పెంచుతుంది. అలాగే రెజీనా, అడవి శేష్ మరియు నవీన్ చంద్ర పాత్రల మధ్య సాగే డ్రామా కూడా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తోంది. ఇక శ్రీచ‌ర‌ణ్ పాకాల నేపధ్య సంగీతం కూడా చాల  బాగుంది.

కాగా ఈ సినిమా ఆగష్టు 15నే రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తుండగా.. వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పీవీపీ బ్యానర్ పై పరం వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీవీపీ అండ్ అడవి శేష్ కాంబినేషన్ లో గతంలో క్షణం అనే హిట్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు