‘మహేశ్ బాబు’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !

‘మహేశ్ బాబు’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !

Published on May 7, 2019 7:02 PM IST

మే 9న రాబోతున్న ‘మహర్షి’ సినిమా పై సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్ష‌కుల కూడా విపరీతమైన ఆసక్తిని కనబరుస్తోన్న సంగతి తెలిసిందే. అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తోన్నా.. ఇప్పటికే మల్టీ స్క్రీన్లు, మల్టీ ఫ్లెక్స్ లు ‘మహర్షి’ బుకింగ్స్ కి ‘సౌల్డ్ ఔట్’ అని బోర్డు పెట్టేశాయి. మరో పక్క థియేటర్ల సంఖ్య పెంచినా, టికెట్లు మాత్రం దొరకడం లేదు. దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమాకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో 5 షోలు వేసుకోవటానికి అనుమతి ఇచ్చింది. మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఖచ్చితంగా ఇది గుడ్ న్యూసే.

మొత్తానికి ‘మహర్షి’ ఈ రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ ను చూస్తుంటే.. ‘మహర్షి’ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో సరి కొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు