కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ హీరో హీరోయిన్లుగా నవీన్ చంద్ర, సాయి కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘అర్ద శతాబ్ధం`. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకం పై రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు ఈ చిత్రాన్న నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతుల మీదుగా విడుదలైన ‘అర్ద శతాబ్ధం’ కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
కాగా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తోందని, ప్రతి పాత్ర ఒక హైలెట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నట్టు తెలిపారు నిర్మాతలు. కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ మరియు ఇతర తారాగణం నటిస్తోన్న ఈ చిత్రానికి. రచన, దర్శకత్వం: రవీంద్ర పుల్లే, నిర్మాత: చిట్టి కిరణ్ రామోజు, డిఓపి: అష్కర్ (బాయ్ ఫేమ్), సంగీతం: నౌఫల్ రాజా (ఎ.ఐ.ఎస్), ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్, పిఆర్ఓ: సాయి సతీష్.