వరద బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించిన త్రివిక్రమ్, ఎస్.రాధాకృష్ణ

వరద బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించిన త్రివిక్రమ్, ఎస్.రాధాకృష్ణ

Published on Oct 20, 2020 3:00 PM IST

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో వరద తాకిడికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తమ వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు).

ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయక చర్యల కోసం తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.10 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ మేరకు సంయుక్తంగా ఒక ప్రకటన‌ చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, సురక్షితం గా ఉండాలని అభిలషించారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు