ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో వలిమైలో స్క్రీన్ షేర్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, ఈరోజు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా హైదరాబాద్ లో గ్రాండ్గా ప్రారంభం అయింది. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది.
కార్తికేయ భార్య లోహిత కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత నాగవంశీ క్లాప్బోర్డ్ని వినిపించారు. ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహించారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది.