ఆరోగ్యం జాగ్రత్త అంటున్నయంగ్ హీరో .

ఆరోగ్యం జాగ్రత్త అంటున్నయంగ్ హీరో .

Published on Jul 30, 2019 10:52 PM IST

యుంగ్ హీరో సందీప్ కిషన్ తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ట్విట్టర్ వేదికగా ఓ ఆరోగ్య సలహా ఇచ్చారు. “ఆరోగ్యం పట్ల జాగ్రతగా ఉండండి, నాకు తెలిసిన వారిలోనే చాలా మంది వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. నేను కూడా 102 ఫీవర్ తో రెండు రోజులుగా బాధపడుతున్నాను, వాతావరణ మార్పు ప్రభావంతో ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి” అని ట్వీట్ చేశారు.

కాగా సందీప్ తాజాగా నటించిన చిత్రం “నిను వీడని నీడను నేను” మంచి విజయాన్ని అందుకుంది. హార్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని సందీప్ కిషన్ స్వయంగా నిర్మించగా, కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. తెలుగులో తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్ చిత్రంతో పాటు, తమిళంలో మరో రెండు చిత్రాలలో ఆయన నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు