ప్రభాస్ కోసం సెట్ రెడీ చేస్తున్నారు !

ప్రభాస్ కోసం సెట్ రెడీ చేస్తున్నారు !

Published on Jun 28, 2020 8:12 PM IST

ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో ‘రాధే శ్యామ్’ అనే ఓ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 6 కోట్ల రూపాయల ఓ భారీ హాస్పిటల్ సెట్‌ ను ప్రస్తుతం మేకర్స్ నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సెట్ కి సంబంధించిన నిర్మణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో నలబై రోజుల్లో ఈ సెట్ పూర్తి చేయనున్నారు.

ఇక జిల్ సినిమాని బాగానే తెరకెక్కించిన డైరెక్టర్ రాధాకృష్ణ‌, ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టాలని బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి రాధాకృష్ణ ఏం చేస్తాడో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని నాలుగు భాషల్లో గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు