మిమ్మల్మి మిస్ అవుతున్నా – అక్కినేని నాగార్జున

మిమ్మల్మి మిస్ అవుతున్నా – అక్కినేని నాగార్జున

Published on Jul 16, 2018 6:01 PM IST

కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో రూపొందుతున్న ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలో అమితాబ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ లతో కలిసి అక్కినేని నాగార్జున కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బల్గేరియాలో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా బల్గేరియాలో జరుగుతున్న షూట్ లో నాగార్జున పాల్గొన్నారు. షూటింగ్‌ లో తన పార్ట్‌ను పూర్తి చేసిన నాగ్‌.. చిత్రబృందాన్ని తోటి నటీనటులను మిస్‌ అవుతున్నట్లు ట్వీట్‌ చేస్తూ.. చిత్ర బృందంతో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ సోషల్‌ మీడియా ద్వారా కీలకమైన పాత్రలో నటించినందుకు నాగ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరణ్‌ జోహార్‌ ట్వీట్ కు నాగ్‌ కూడా స్పందిస్తూ.. కరణ్‌ కు తిరిగి ధన్యవాదాలు చెప్పాడు. ఐతే నాగార్జున ఇప్పటికే జక్మ్‌, ఖుదా గవా లాంటి కొన్ని హిందీ సినిమాల్లో నటించారు. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్‌ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు