ప్రభాస్ జాన్ మూవీ విలన్ పై క్రేజీ న్యూస్

ప్రభాస్ జాన్ మూవీ విలన్ పై క్రేజీ న్యూస్

Published on Sep 25, 2019 9:01 AM IST

ప్రభాస్ సాహో చిత్రం తరువాత జిల్ ఫేమ్ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంతో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మేర చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం పీరియాడిక్ మూవీ గా తెరకెక్కుతుంది. 1960 ల కాలంలో యూరప్ లో జరిగిన ఓ అందమైన రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని గతంలో ప్రభాస్ చెప్పడం జరిగింది. ఐతే ఈ చిత్రంలో విలన్ రోల్ చేస్తున్న నటుడి గురించి ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

హీరో నుండి విలన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన బిజీ నటుడు జగపతి బాబు ప్రభాస్ కి విలన్ గా చేయనున్నారట. రంగస్థలం చిత్రంలో మాదిరి జాన్ మూవీలో కూడా జగపతి బాబు పాత్ర విలక్షణంగా ఆకట్టుకొనేలా ఉంటుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికయ్యారని వార్తలు వస్తున్నాయి. సాహో నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ జాన్ చిత్రానికి కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు