ప్రభాస్ సినిమా పై ఇంట్రస్టింగ్ రూమర్ ?

ప్రభాస్ సినిమా పై ఇంట్రస్టింగ్ రూమర్ ?

Published on Jul 14, 2020 3:00 AM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అయితే, ఈ సినిమా కథ విషయంలో ఒక ఇంట్రస్టింగ్ రూమర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నాగ్ అశ్విన్ ఓ పురాణ కథలోని పాత్రల ఆధారంగా.. నేటి సమాజానికి తగ్గట్లు కథ రాసుకున్నాడని.. ముఖ్యంగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇక నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ను తీసుకొవాలని చూస్తున్నారట. ఇప్పటికే కొంతమందితో ఫోన్ లోనే సంప్రదించినట్లు తెలుస్తోంది. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా స్క్రిప్ట్ కి డైలాగ్స్ రాస్తున్నాడు.

తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు