మహేష్ డైరెక్టర్ వెబ్ సిరీస్ చేస్తున్నాడా ?

మహేష్ డైరెక్టర్ వెబ్ సిరీస్ చేస్తున్నాడా ?

Published on Jul 5, 2020 6:56 PM IST

‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నారు. కానీ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చలేదని, అందుకే ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గాని, ప్రభాస్ తో గాని ప్లాన్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాయి. చివరికీ అవి కూడా కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి రెండు వెబ్ సిరీస్‌ లు చేయడానికి ఓకే చెప్పారట.

అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి చేత వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేసాడట. ఇక వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అలాగే డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఈ లాక్ డౌన్ లో వెబ్ సిరీస్ కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసిన్నట్లు తెలుస్తోంది. మరి పూరి ఏ ప్లాట్ ఫామ్ కి వెబ్ సిరీస్ చేస్తాడో చూడాలి. మరో స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు