నైజాం లో ఇస్మార్ట్ శంకర్ దుమ్మురేపాడుగా…!

నైజాం లో ఇస్మార్ట్ శంకర్ దుమ్మురేపాడుగా…!

Published on Jul 26, 2019 12:37 PM IST

ఇస్మార్ట్ శంకర్ మూవీతో హీరో రామ్,దర్శకుడు పూరిలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ వసూళ్ల పరంగా కూడా మొదటివారం దుమ్మురేపింది. విడుదలైన అన్ని ఏరియాలలో హిట్ టాక్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది.తాజా లెక్కల ప్రకారం ఇస్మార్ట్ శంకర్ వరల్డ్ వైడ్ గా మొదటి వారానికి గాను, 32కోట్ల షేర్ సాధించింది. ఈ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అంచనాలకు మించిన లాభాలు అందుకుంటున్నారని తెలుస్తుంది.

ముఖ్యంగా నైజాం ఏరియాలో ఇస్మార్ట్ శంకర్ వసూళ్ల వరదపారించింది. నిన్న గురువారం సాధించిన 35లక్షల షేర్ కలుపుకొని మొత్తం 12కోట్లకు వసూళ్లకు చేరింది. విడుదలైన ఎనిమిది రోజులకు గాను దాదాపు 33కోట్ల షేర్ వాసులు చేసిన ఈ చిత్రం లాంగ్ రన్ లో 40కోట్లకు చేరే అవకాశం కలదు. ఇప్పటికీ నైజాంలోని చాలా ఏరియాలో ఈ మూవీ మంచి ఆదరణతో దూసుకుపోతుంది. రామ్ సరసన నిధి అగర్వాల్,నాభా నటేష్ నటించగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు