హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనెర్ ‘ఇస్మార్ట్ శంకర్’. కాగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.
ఇక మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన నాలుగు పాటలకు ఇప్పటికే అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్ లో కనపింబోతున్నారు. సినిమా పై భారీ అంచనాలున్నాయి. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ కు, దిమాక్ ఖరాబ్ అనే సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో చూడాలి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.