యాక్షన్, ఎమోషనల్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ట్రైలర్

యాక్షన్, ఎమోషనల్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ట్రైలర్

Published on Nov 12, 2022 6:39 PM IST


అల్లరి నరేష్ హీరోగా జీ స్టూడియోస్, హాస్య మూవీస్‌ సంస్థల సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈ మూవీలో అల్లరి నరేష్ కి జోడీగా ఆనంది నటిస్తుండగా ఏ ఆర్ మోహన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఎమోషనల్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ మూవీ యొక్క పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ఆడియన్స్ లో మూవీ పై మంచి ఆసక్తిని ఏర్పరిచాయి. ఇటీవల నటించిన నాంది మూవీలోని పాత్ర మాదిరిగా ఈ సినిమాలో కూడా అల్లరి నరేష్ యాక్షన్ తో కూడిన ఒక పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. కాగా ఇందులో ఆయన గవర్నమెంట్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

ఇక కొద్దిసేపటి క్రితం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది యూనిట్. ట్రైలర్ లో అల్లరి నరేష్ యాక్టింగ్, డైలాగ్స్, ఎంతో బాగున్నాయి. ముఖ్యంగా విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్, ఎమోషన్స్ వంటివి కూడా బాగున్నాయి. ట్రైలర్ లో రఘుబాబు, సంపత్ రాజ్ ల యాక్టింగ్ బాగుంది. మొత్తంగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచింది అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో మంచి వ్యూస్ లభిస్తున్నాయి. ఇక ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా దీనిని నవంబరు 25న గ్రాండ్ లెవెల్లో థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు