రానా, అనుష్క లకు జేమ్స్ బాండ్ షాక్ ఇచ్చాడు

రానా, అనుష్క లకు జేమ్స్ బాండ్ షాక్ ఇచ్చాడు

Published on Feb 23, 2020 6:44 PM IST

శ్రీరామ నవమి కానుగా టాలీవుడ్ కి చెందిన నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్సు థ్రిల్లర్ నిశ్శబ్దం ఏప్రిల్ 2న విడుదల కానుంది. అలాగే రానా హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ అరణ్య కూడా ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సాయిధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన కూడా అదే రోజున రానుంది. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ మొదట ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి . ఐతే ఈ చిత్రం మే కి పోస్టుపోన్ అయినట్లు తెలుస్తుంది. కాగా ఈ హెవీ ఫైట్ మధ్యలో జేమ్స్ బాండ్ వచ్చి చేరారు.

జేమ్స్ బాండ్ సిరీస్ లో 25వ చిత్రంగా వస్తున్న ‘నో టైం టు డై’ మూవీ కూడా ఇండియాలో ఏప్రిల్ 2న విడుదల కానుంది. హిందీ, తమిళ్, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉండే జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాలకు ఇండియాలో కూడా మంచి మార్కెట్ ఉంది. దీనితో మల్టీ లాంగ్వేజ్ లలో విడుదల అవుతున్న అనుష్క నిశ్శబ్దం, రానా ‘అరణ్య’ సినిమాలపై ‘నో టైం టు డై’ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. రానా, అనుష్క చిత్రాలకు ఓపెనింగ్స్ తగ్గే ప్రభావం ఉంటుంది. 2006 లో వచ్చిన ‘క్యాసినో రాయలే’ చిత్రం నుండి బ్రిటిష్ నటుడు డేనియల్ గ్రెగ్ బాండ్ చిత్రాలలో నటిస్తున్నారు. ‘నో టైం టు డై’ ఆయనకు 5వ జేమ్స్ బాండ్ చిత్రం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు