షారుఖ్ తో మరోసారి కనిపించేందుకు ఉవ్విళ్ళూరుతున్న ఎన్టీఆర్ నటి

షారుఖ్ తో మరోసారి కనిపించేందుకు ఉవ్విళ్ళూరుతున్న ఎన్టీఆర్ నటి

Published on Apr 11, 2024 12:00 AM IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన లేటెస్ట్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో చేసిన సెన్సేషనల్ హిట్ చిత్రం “జవాన్” (Jawan) కూడా ఒకటి. మరి ఈ చిత్రం భారీ హైప్ నడుమ వచ్చి 1000 కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టి దుమ్ము లేపింది. అయితే ఈ చిత్రంలో షారుఖ్ తో పాటుగా తన లేడీ గ్యాంగ్ గా యంగ్ నటీమణులతో ప్రముఖ నటి ప్రియమణి కూడా కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో “యమదొంగ” సినిమాలో కనిపించి తెలుగు ఆడియెన్స్ ని మెప్పించిన ఈమె షారుఖ్ ఖాన్ తో చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత జవాన్ తో రెండో సారి ప్రియమణి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే మరోసారి నటించే అవకాశం వస్తే చేస్తారా అంటే షారుఖ్ ఖాన్ ఇప్పుడు వచ్చి అడిగినా గ్యారెంటీగా చేస్తాను కితాబిచ్చింది. బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ (Ajay Devgn) నటించిన “మైదాన్” (Maidan) లో ఆమె కీలక పాత్రలో నటించగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ విషయాన్ని రివీల్ చేసింది. షారుఖ్ తో నటించేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటానని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు