సునీల్, సుక్రాంత్ వీరెల్ల ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘కనబడుటలేదు’. బాలరాజు ఎం దర్శకత్వంలో ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ బ్యానర్స్పై సాగర్ మంచనూరు, సతీశ్ రాజు, దిలీప్ కూరపాటి, డా.శ్రీనివాస్ కిషన్ అనపు, దేవీ ప్రసాద్ బలివాడ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగష్ట్ 19న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ వైశాలి రాజ్ మీడియాతో ముచ్చటించింది.
హీరోయిన్గా నాకు ఇది తొలి చిత్రం అని, నా స్క్రీన్ నేమ్ వైశాలి రాజ్ అని అన్నారు. నా అసలు పేరు కవిత మాది వైజాగ్ అని అన్నారు. తాను పుట్టి పెరిగింది, చదువువంతా వైజాగ్లోనే సాగింది. రెండేళ్ల ముందు నాన్న చనిపోయారు. నాన్నగారు చనిపోయిన తర్వాత జాబ్ మానేశాను. మా అమ్మగారి సపోర్ట్ వలనే తాను సినిమాల్లోకి వచ్చానని, షార్ట్ ఫిలింస్లో యాక్ట్ చేసేదానినని, రెండేళ్ల ముందు ఓ షార్ట్ ఫిల్మ్లో నా ఫటో చూసిన బాలరాజుగారు నాకు హీరోయిన్గా అవకాశం ఇచ్చారని అన్నారు.
ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఇది ఖచ్చితంగా ఈ సినిమా బెస్ట్ అని చెప్పగలను, పక్కా ఆడియెన్స్కు నచ్చుతుందని, సునీల్గారు మెయిన్ రోల్ చేశారు. ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా అనిపించిందని, ఆయన చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారని అన్నారు.
ఈ సినిమా నా చుట్టూనే రన్ అవుతుందని, ఏడాదిన్నరగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను, ఓ మిడిల్ క్లాస్ పక్కింటి అమ్మాయి పాత్రలో నేను నటించానని, నా పాత్రలో అన్ని ఎమోషన్స్ ఉంటాయని అన్నారు. ఇకపోతే నాకు డైరెక్షన్ కూడా చేయాలని ఉందని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. ప్రస్తుతం కొన్ని స్టోరీస్ వింటున్నానని, ఈ సినిమా రిలీజ్ తర్వాత వాటి గురుంచి చూడాలని అన్నారు.
నేను ఎక్కడా యాక్టింగ్ నేర్చుకోలేదని, కొన్ని షార్ట్ ఫిలింస్లో యాక్ట్ చేశాను, మౌన రాగం అనే సీరియల్లో నెగటివ్ రోల్ చేశాను. హీరోయిన్స్ పాత్రలే కాదు, పెర్ఫామెన్స్కు ప్రాధాన్యం ఉండే పాత్రలైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని వైశాలి రాజ్ చెప్పుకొచ్చారు.