ఎన్టీఆర్ తో మూవీ పై క్లారిటీ ఇచ్చిన ‘కాంతారా’ హీరో

ఎన్టీఆర్ తో మూవీ పై క్లారిటీ ఇచ్చిన ‘కాంతారా’ హీరో

Published on Nov 6, 2022 3:01 AM IST

తాజాగా కన్నడనాట తెరకెక్కి అద్భుత విజయం అందుకుని దూసుకెళ్తున్న కాంతారా మూవీ ఇటు తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో సైతం అదరగొడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్ సొంతం చేసుకున్న కాంతారా మూవీ ఇంకా బాక్సాఫీస్ వద్ద తన దూకుడుని కొనసాగిస్తూనే ఉంది. డివైన్ బ్లాక్ బస్టర్ అయిన కాంతారా లో హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించారు రిషబ్ శెట్టి. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరాగందూర్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

అయితే విషయం ఏమిటంటే, ఇటీవల ఈ మూవీ చూసి హీరో ఎన్టీఆర్ తనను ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు హీరో రిషబ్ శెట్టి. కాగా వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా రూపుదిద్దుకోనుంది అనే వార్తలు పలు మీడియా మాధ్యమాల్లో ఇటీవల ప్రచారం అయ్యాయి. అయితే వాటి పై నేడు ఒక ఇంటర్వ్యూ లో భాగంగా క్లారిటీ ఇచ్చారు రిషబ్ శెట్టి. నిజానికి తనకు కూడా ఎన్టీఆర్ వంటి స్టార్ యాక్టర్ తో వర్క్ చేయాలని ఉంటుందని, కానీ ప్రస్తుతానికైతే తనకు అటువంటి ఆలోచన లేదని అన్నారు. అలానే తాను ఏదైనా స్టోరీ రాసుకున్న తరువాతనే దానికి సరిపోయే నటీనటుల్ని ఎంపిక చేసుకుంటానని, అదే తన అలవాటని ఆయన అన్నారు. మరి రాబోయే రోజుల్లో అయినా ఎన్టీఆర్ తో రిషబ్ మూవీ చేస్తారో లేదో తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు