100కోట్ల క్లబ్ లో చేరిన మలయాళ యువ హీరో !

100కోట్ల క్లబ్ లో చేరిన మలయాళ యువ హీరో !

Published on Nov 28, 2018 11:49 AM IST

మాలీవుడ్ సెన్సేషనల్ హీరో నివిన్ పౌలీ నటించిన తాజా చిత్రం ‘కాయంకుల కొచ్చుణ్ణి’ 100కోట్ల వసూళ్లను రాబట్టి కొత్త రికార్డు సృష్టించింది. ఇటీవల విడుదలైన ఈచిత్రం పాజిటివ్ మాత్ టాక్ తో ఇప్పటికీ కేరళలోని కొన్ని థియేటర్లలో మంచి రన్ ను కనబరుస్తుంది. 45 కోట్ల బడ్జెట్తో గోకుల్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పటివరకు మళయాలంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం.

ఈచిత్రంలో ప్రియా ఆనంద్ , బాబు ఆంటోనీ ముఖ్య పాత్రల్లో నటించగా స్టార్ హీరో మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈచిత్రం రేపటి తో 50రోజులను పూర్తి చేసుకోనుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు