టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్న ఎంఎం కీరవాణి పాన్ ఇండియన్ సినిమాలకు సంగీతం అందిస్తూ టాలీవుడ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 1990లో మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించిన కీరవాణి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటివరకు దాదాపు 150 సినిమాలకు పైగా సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” సినిమాకు కీరవాణినే సంగీతం అందిస్తున్నాడు.
అయితే ఈ సినిమా కోసం కీరవాణి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం కీరవాణి ఏకంగా రూ.18 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అయితే దీనిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన దోస్తీ పాటను చూస్తుంటే కీరవాణికి ఆ మాత్రం రెమ్యునరేషన్ ఉండాల్సిందే అంటున్నారు చాలా మంది సంగీత ప్రియులు. మరీ మీరేమంటారు.