ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన కీర్తి సురేష్, అనుపమ లేటెస్ట్ థ్రిల్లర్

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన కీర్తి సురేష్, అనుపమ లేటెస్ట్ థ్రిల్లర్

Published on Apr 19, 2024 9:01 AM IST


కోలీవుడ్ సినిమా దగ్గర రీసెంట్ గా వచ్చిన పలు డీసెంట్ హిట్ చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు జయం రవి ప్రధాన పాత్రలో టాలెంటెడ్ స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేష్ అలాగే అనుపమ పరమేశ్వరన్ లు నటించిన ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే “సైరన్”. రవి వినూత్న సినిమాల్లో ఇదొకటిగా వచ్చి తమిళ నాట మంచి హిట్ అయ్యింది. ఇక దీనితో ఈ సినిమా ఓటిటి కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూడగా ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమా హక్కులు ప్రముఖ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు కొనుగోలు చేయగా అందులో ఈ చిత్రం నేటి నుంచి ఒరిజినల్ తమిళ్ సహా తెలుగు, కన్నడ, మళయాళం మరియు హిందీ భాషలతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమాని ట్రై చేయాలి అనుకునే వారు ఇప్పుడు హాట్ స్టార్ లో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రాన్ని ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించగా సామ్ సి ఎస్, జివి ప్రకాష్ లు సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు