ఎగ్జైటింగ్ అప్ డేట్ కి సిద్దమైన ‘కుబేర’

ఎగ్జైటింగ్ అప్ డేట్ కి సిద్దమైన ‘కుబేర’

Published on Apr 29, 2024 6:31 PM IST

నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థల పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ కుబేర. ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ధనుష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈమూవీ యొక్క తాజా షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది.

విషయం ఏమిటంటే, మే 2న తమ మూవీ నుండి ఒక ఎగ్జైటింగ్ అప్ డేట్ రానుందని తాజాగా మేకర్స్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా తెలిపారు. మరి ఇంతకీ ఆ అప్ డేట్ ఏంటో తెలియాలి అంటే మరొక మూడు రోజుల సమయం ఆగాల్సిందే. కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న కుబేర మూవీని ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు