తారక్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.!

తారక్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on May 20, 2020 3:00 AM IST

ప్రస్తుతం మన దక్షిణాది నుంచి వస్తున్న, రావడానికి సన్నద్ధం అవుతున్న భారీ ప్రాజెక్టులలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ ల కాంబోలో తెరకెక్కనున్న చిత్రం కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అన్నప్పుడే ఈ సినిమాపై అంచనాలు స్కైహై కు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా ఓపక్క తారక్ పుట్టిన రోజున సరైన అప్డేట్ లేదని కాస్త నిరాశలోనే ఉన్నారు.

కానీ వారికి కాస్త ఊరటనిచ్చేలా ఈ భారీ ప్రాజెక్ట్ పై తాజాగా ఓ టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి తారక్ కాస్త ఎక్కువ డేట్లు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని కూడా భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కించనున్నారని అలాగే కేవలం మూడు భాషల్లో ఏకకకాలంలో తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. తెలుగు,కన్నడ మరియు హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుందట. దీనిపై తారక్ పుట్టిన రోజునే ఏదొక సమాచారం బయటకు రానున్నట్టు వినికిడి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు