భారీ రేటుకి అమ్ముడైన ‘లైగర్’ శాటిలైట్, డిజిటల్ రైట్స్ … ?

భారీ రేటుకి అమ్ముడైన ‘లైగర్’ శాటిలైట్, డిజిటల్ రైట్స్ … ?

Published on Jul 23, 2022 5:09 PM IST

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ల తొలి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగష్టు 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్, టీజర్, మొన్నటి థియేట్రికల్ ట్రైలర్ ఇలా అన్ని కూడా మూవీపై అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచాయి. బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటితున్న లైగర్ మూవీని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తుండగా రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం లైగర్ ట్రైలర్ యూట్యూబ్ లో భారీ స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. మరోవైపు ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ని ఒక ప్రముఖ సంస్థ దాదాపుగా రూ. 55 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మూవీ పైన విపరీతమైన క్రేజ్ ఉండడంతో ఇంత భారీ రేట్ కి రైట్స్ అమ్ముడయ్యాయని అంటున్నారు. ఇక ఈ మూవీ కోసం దర్శకడు పూరి, హీరో విజయ్ ఎంతో కష్టపడ్డారని, తప్పకుండా రిలీజ్ తరువాత లైగర్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖయాం అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు