చైతూతో దుబాయ్ వెళుతున్న సాయి పల్లవి

చైతూతో దుబాయ్ వెళుతున్న సాయి పల్లవి

Published on Feb 20, 2020 9:21 PM IST

దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రేమికుల రోజు కానుకగా లవ్ స్టోరీ మూవీ నుండి ఓ వీడియో ప్రోమో విడుదల చేయగా యూత్ కి బాగా నచ్చేసింది. ఆ ప్రోమోలో చైతూ, సాయిపల్లవి ల జంట చక్కగా ఉన్నారు. ఇక చైతు లుక్ చాల డిఫరెంట్ గా ఉంది. మిడిల్ క్లాస్ అబ్బాయి అమ్మాయి మధ్య నడిచే సెన్సిబుల్ ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది అనిపిస్తుంది.

కాగా తాజా షెడ్యూల్ కొరకు లవ్ స్టోరీ టీమ్ దుబాయ్ వెళ్లనున్నారట. దుబాయిలో కొన్ని పాటల చిత్రీకరణతో పాటు, కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. నారాయణ్ కె నారంగ్, పి రామ్ మోహన్ నిర్మాతలుగా నిర్మిస్తుండగా, వేసవి కానుకగా ఏప్రిల్ 2న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు