టీవీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకున్న “మ్యాడ్”

టీవీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకున్న “మ్యాడ్”

Published on Dec 6, 2023 7:00 PM IST


సంగీత శోభన్, నర్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతికా సనిల్ కుమార్, గోపికా ఉదయన్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ రచన, దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది.

ఈ చిత్రం ఇప్పుడు టీవీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ తెలుగు ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. త్వరలో ఈ సినిమా ఈటీవీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు