మహేష్ బాబు మల్టీ ఫ్లెక్స్ లో రజనీకాంత్ ?

మహేష్ బాబు మల్టీ ఫ్లెక్స్ లో రజనీకాంత్ ?

Published on Nov 14, 2018 4:20 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటు సినిమాలు చేస్తూనే.. అటు మల్టీ ఫ్లెక్స్ బిజినెస్ లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. మహేష్, ఏషియన్ సినిమాస్ తో కలిసి.. ఏ.ఎమ్.బి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదట అమీర్, అమితాబ్ ల థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రంతో థియేటర్స్ ను ఓపెన్ చేయాలనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు.

కాగా తాజాగా రజినీకాంత్ 2.0 చిత్రంతో ఏ.ఎమ్.బి మల్టీప్లెక్స్ థియేటర్స్ ను ఓపెన్ చేయాలని మహేష్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2.0 చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందంతో పాటు రజినీకాంత్ హైదరాబాద్ రానున్నారు. ఆ సమయంలోనే రజినీకాంత్ మరియు 2.0 చిత్రబృందం చేతుల మీదుగా థియేటర్స్ ను ఓపెన్ చేస్తారట.

ఈ మల్టి ఫ్లెక్స్ థియేటర్స్ భారీ సాంకేతిక హంగులతో నిర్మించబడ్డాయి. ప్రేక్షకులు సినిమా చూడటానికి అత్యంత సౌకర్యవంతగా వుంటుందని తెలుస్తోంది. ఇక మహేష్ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు