బాలయ్య కొత్త ట్రెండ్.. ఫాలో అవ్వాల్సిందేనంటున్న చిరు ఫ్యాన్స్

బాలయ్య కొత్త ట్రెండ్.. ఫాలో అవ్వాల్సిందేనంటున్న చిరు ఫ్యాన్స్

Published on Oct 23, 2020 10:10 AM IST

నందమూరి బాలకృష్ణ కొత్తగా చేస్తున్న ప్రయత్నం ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అదే ‘నర్తనశాల’ ఫుటేజ్ విడుదల. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అందుకే అభిమానులకు కూడ ‘నర్తనశాల’ అంటే ఒక ప్రత్యేకమైన క్యూరియాసిటీ. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్య్ మొదలైన కొన్నిరోజులకే ఆగిపోవడంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు వాళ్ళను అలరించడానికి అప్పట్లో షూట్ చేసిన ఫుటేజ్ ను ఎడిట్ చేసి 17 నిముషాలకు కుదించి విజయదశమి రోజున విడుదలచేయనున్నారు.

బాలయ్య తీసుకొచ్చిన ఈ కొత్త ట్రెండ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్ని ఆకట్టుకోవడమే కాదు వారి మనసులో కూడ ఒక కోరిక పుట్టేలా చేసింది. గతంలో చిరు మొదలుపెట్టి ఆపేసిన సినిమాల్లో ‘అబు : బాగ్దాద్ గజదొంగ’ సినిమా ఒకటి. ‘బాషా’ ఫెమ్ సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. అప్పట్లోనే భారీ వ్యయంతో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. హాలీవుడ్ నుండి టెక్నీషియన్లను కూడ తీసుకొచ్చారు. కానీ ఎందుకో కొంత భాగం షూటింగ్ జరుపుకున్నాక చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమా ఫుటేజును ‘నర్తనశాల’ తరహాలోనే ఎడిట్ చేసి విడుదల చేయమని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అభిమానుల కోరికతో చిరు ‘అబు’ ఫుటేజ్ బయటకు తీసే పనులు మొదలపెడతారేమో చూద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు