వైరల్ వీడియో : ‘వాల్తేరు వీరయ్య’ సెకండ్ సాంగ్ అప్ డేట్ ఇచ్చిన మెగాస్టార్

వైరల్ వీడియో : ‘వాల్తేరు వీరయ్య’ సెకండ్ సాంగ్ అప్ డేట్ ఇచ్చిన మెగాస్టార్

Published on Dec 15, 2022 12:05 AM IST


టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యువ దర్శకడు బాబీ దర్శకత్వంలో చేస్తోన్న ప్రతిష్టాత్మక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే వాల్తేరు వీరయ్య నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ బాస్ పార్టీ ఏకంగా యూట్యూబ్ లో 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోగా ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ ని త్వరలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే ఈ మూవీలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని ఫ్రాన్స్ లో ప్రస్తుతం చిత్రీకరించింది యూనిట్. దీనికి సంబంధించి ఒక సూపర్ అప్ డేట్ ని కొద్దిసేపటి క్రితం అందించారు మెగాస్టార్ చిరంజీవి.

మొన్నటితో ఈ సాంగ్ షూట్ మొత్తం పూర్తి అయిందని, సౌత్ ఫ్రాన్స్ చుట్టుప్రక్కల గల అందాలు తనకు ఎంతో నచ్చాయని, అందుకే అక్కడి అందాలు తన ఫోన్ లో వీడియో రికార్డు చేసి మీ అందరితో పంచుకుంటున్నాను, అలానే ఈ సాంగ్ షూట్ సమయంలో మైనస్ డిగ్రీస్ చలి కారణంగా స్టెప్స్ వేయడం ఒకింత కష్టం అనిపించినప్పటికీ ఫ్యాన్స్, ఆడియన్స్ కోసం తాను ఎంతో ఇష్టంతో చేసానని కొద్దిసేపటి క్రితం తన ఇన్స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా ఒక వీడియో బైట్ రిలీజ్ చేసారు మెగాస్టార్ చిరంజీవి.

అలానే ఈ మూవీ నుండి నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతాను అనే పల్లవితో సాగే ఈ సాంగ్ ని ఇక్కడ చిత్రీకరించడం జరిగిందని, ఆ సాంగ్ యొక్క చిన్న ప్రోమో ని ఆయన తన వీడియో బైట్ లో పొందుపరిచారు. అతి త్వరలో ఈ సాంగ్ లిరికల్ వీడియో మీ ముందుకు వస్తుందని తెలిపారు మెగాస్టార్. కాగా వాల్తేరు వీరయ్య మూవీ 2023 జనవరి 13 న రిలీజ్ కానుంది. కాగా ప్రస్తుతం మెగాస్టార్ ఇచ్చిన ఈ అప్ డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ ఇన్స్టాగ్రామ్ వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CmJdL8XJIaP/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు