ఆది చిత్రానికి చిరంజీవి చీఫ్ గెస్ట్

ఆది చిత్రానికి చిరంజీవి చీఫ్ గెస్ట్

Published on Dec 17, 2011 5:15 PM IST

ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిసెట్టి కొడుకు ఆది త్వరలో మన ముందుకు ‘ఏకవీర’ అనే చిత్రం తో రాబోతున్నాడు.ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ నేడు హైదరాబాద్ లో ధస్పల్ల హోటల్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. తమిళ నటుడు కార్తి కూడా ముఖ్య అతిధి గా విచ్చేయనున్నాడు.

ఏకవీర తమిళం లో ఆరవన్ చిత్రానికి డబ్బింగ్ చిత్రం గా మన ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి వసంత బాల దర్శకుడు కాగా, శ్రీనివాస్ దామెర నిర్మాత. దంసిక ఈ చిత్రం లో కథానాయిక. ఈ చిత్రం 18 వ శతాబ్దం లో జరిగిన కథ గా మన ముందుకు వస్తుంది. కార్తిక్ సంగీతాన్ని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు