ఎన్టీఆర్ సినిమా పై ఆ రూమర్ అవాస్తవం !

ఎన్టీఆర్ సినిమా పై ఆ రూమర్ అవాస్తవం !

Published on Jun 29, 2020 6:59 AM IST

అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారట. సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో మలయాళీ స్టార్ మోహన్ లాల్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాస్తున్నాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని ఇలా ఓ రూమర్ వచ్చింది. ఆయితే దానిలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అన్నికుదిరితే డిసెంబర్ నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా 2021 సమ్మర్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు