‘ఛలో’ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కిన యువ హీరో నాగ శౌర్య. ఇంతకూ ముందులా కాకుండా ఆచి తూచి కథల్ని ఎంచుకుంటున్న ఆయన ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకుని దర్శకుడిగా కూడ మారారు. అయితే ఆ దర్శకత్వం సినిమాకి కాదు షార్ట్ ఫిల్మ్ కోసం. అవును.. నాగ శౌర్య మాతృ దినోత్సవం కోసం ‘భూమి’ అనే పేరుతో ఒక షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు.
దాన్ని రేపు 13వ తేదీన మథర్స్ డే సందర్బంగా విడుదలచేయనున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ ను ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై శౌర్య తల్లిదండ్రులు ఉష మల్పూరి, శంకర్ ప్రసాద్ లు నిర్మించారు. ఇకపోతే శౌర్య ప్రస్తుతం నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో ‘నర్తనశాల’ అనే సినిమాలో నటిస్తున్నారు.


