నిఖిల్ ‘అర్జున్ సురవరం’కి ఇంకా క్లారిటీ రాలేదు !

నిఖిల్ ‘అర్జున్ సురవరం’కి ఇంకా క్లారిటీ రాలేదు !

Published on Sep 22, 2019 9:21 AM IST

నూతన దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో యువ హీరో నిఖిల్ హీరోగా లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఎప్పుడో విడుదల కావాల్సిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ఆయితే నిఖిల్ కి ఈ మధ్య అసలు టైం కలిసిరావడం లేదు. ఒక పక్క తోటి హీరోలు వరుస సక్సెస్ లతో ఊపు మీద ఉంటే.. నిఖిల్ మాత్రం చేసిన సినిమాని కూడా రిలీజ్ చేసుకోలేక బాక్సాఫీస్ వద్ద వెనుకబడిపోతున్నాడు. గత సంవత్సరమే రిలీజ్ అవ్వాల్సిన ‘అర్జున్ సురవరం’ విడుదల పై ఇంకా క్లారిటీ రాలేదు. మొదట్లో ‘ముద్ర’ అనే టైటిల్ పెట్టగా వేరే సినిమాతో వివాదమై దాన్ని ‘అర్జున్ సురవరం’గా మార్చారు. ఆ తర్వాత మే 1న సినిమా వస్తుందనుకుంటే అది వాయిదాపడింది. ఆ తరవాత కూడా పలుసార్లు తేదీని మార్చారు. కానీ ఇప్పటికీ ఆ సినిమా కష్టాలు తొలగినట్టు కనిపించట్లేదు. మొత్తానికి ‘అర్జున్ సురవరం’ రిలీజ్ సైరా తరువాతే ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చినా… విడుదల ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

ఏమైనా మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే నిఖిల్ సినిమా రిలీజ్ అవ్వకపోవడం ఆశ్చర్యకరమే. నిజానికి నిఖిల్ కి బాగానే హిట్లు వచ్చాయి. నిఖిల్ కి వచ్చిన సక్సెస్ స్థాయికి.. నిఖిల్ వరుస సినిమాల రిలీజ్ లతో బిజీ బిజీగా ఉండాలి. కానీ నిఖిల్ సినిమా వాయిదా పడుతూ ఉంది. ప్రస్తుతం నిఖిల్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ సినిమాను చేయడానికి ప్రస్తుతం నిఖిల్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు