ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలఫై టిట్లి తుఫాన్ గట్టిగానే ప్రభావం చూపింది. ఈ తూఫాన్ దెబ్బకు ఈ రెండు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇరక మరో వైపు సినీ హీరోల నుండి ఆంధ్రప్రేదేశ్ ముఖ్యమంత్రి సహాయక నిధికి విరాళాలు వెల్లువెత్తున్నాయి. నిన్న విజయ్ దేవరకొండ రిలీఫ్ ఫండ్ కి 5లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించగా తాజాగా అగ్ర హీరో ఎన్టీఆర్ 15లక్షలు అలాగే ఆయన అన్న కళ్యాణ్ రామ్ 5లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం గా ఇచ్చారు.