‘యన్.టి.ఆర్ బయోపిక్’ ఆడియో వేడుకకు ముహూర్తం కుదిరింది !

‘యన్.టి.ఆర్ బయోపిక్’ ఆడియో వేడుకకు ముహూర్తం కుదిరింది !

Published on Nov 21, 2018 12:48 PM IST

సీనియర్ అగ్ర హీరో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘యన్.టి.ఆర్ బయోపిక్’ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక డిసెంబర్ 16న తిరుపతి లో గ్రాండ్ గా జరుగనుందని సమాచారం. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానునున్నారు.

విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి నిజజీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానునుంది. దాంట్లో మొదటి భాగం ‘కథానాయకుడు’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈమొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని చూపించనున్నారు. విద్యాబాలన్ , సుమంత్, నిత్య మీనన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరెక్కిస్తున్నారు. ఎన్బికె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ , విబ్రి మీడియా సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు